తెలంగాణ

telangana

విద్యుదాఘాతంతో దంపతులు మృతి.. 2 రోజుల తర్వాత గుర్తింపు

By

Published : Dec 19, 2021, 2:20 PM IST

Updated : Dec 19, 2021, 5:28 PM IST

couple died due to electric shock in Sangareddy district
couple died due to electric shock in Sangareddy district

14:17 December 19

couple died with current shock: విద్యుదాఘాతంతో దంపతులు మృతి..

couple died with current shock: సంగారెడ్డి చౌటకూరు మండలం వెండికోల్‌ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో దంపతులు మృతి చెందిన విషయం రెండు రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది.హైదరాబాద్​కు చెందిన లక్ష్మణ్​రావు అనే వ్యక్తి ఫామ్​హౌస్​లో ఏపీలోని విశాఖపట్నం జిల్లా మాడుగుల మండలం సురావరానికి చెందిన బిక్కిన శ్రీనివాస్.. అతడి భార్య దేవీ పనిచేస్తున్నారు. అదే ఫామ్​హౌస్​లో రేకులతో నిర్మించిన ఇంట్లో వాళ్లు నివాసముంటున్నారు.

స్నానానికి వెళ్తూ టవల్​ తీసుకునే క్రమంలో..

రోజూ మాదిరిగానే ఈ నెల 16న సాయంత్రం పూట.. చేనులో పని ముగించుకొని ఇంటికి వచ్చిన శ్రీనివాస్​ స్నానానికి సిద్ధమయ్యాడు. ఇంట్లో బట్టల కోసం ఇనుప వైర్​తో కట్టిన దండెం మీద ఉన్న టవల్​ను తీస్తుండగా.. విద్యుదాఘాతానికి గురై ఒక్కసారిగా కిందపడిపోయాడు. శ్రీనివాస్​ అరుపులు విన్న భార్య దేవి.. అతడ్ని రక్షించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో దేవి కూడా కరెంట్​షాక్​కు గురైంది. ఈ ప్రమాదంలో ఇద్దరూ మృత్యువాతపడ్డారు.

కుక్కల అరుపులతో రెండు రోజుల తర్వాత..

ఫామ్​హౌస్​లోకి ఎవరూ వెళ్లకపోవటం వల్ల.. ఈ విషయం బయటపడలేదు. 18న సాయంత్రం కుక్కలు తీవ్రంగా అరవటం వల్ల.. పక్కన చేనులో పనిచేసే కూలీలకు అనుమానం వచ్చింది. వెంటనే గ్రామ సర్పంచ్​కు విషయాన్ని తెలపగా.. ఈ విషాదం వెలుగుచూసింది. పోలీసులకు సమాచారమివ్వగా.. ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. భార్యభర్తలిద్దరు మృతి చెందడం వల్ల వారి పిల్లలు అనాథలయ్యారు.

ఇదీ చూడండి:

Last Updated : Dec 19, 2021, 5:28 PM IST

ABOUT THE AUTHOR

...view details