తెలంగాణ

telangana

ETV Bharat / crime

కరోనా బారినపడి నీలోఫర్ ఆస్పత్రి హెడ్​నర్స్ మృతి

కరోనా బాధితులకు నిత్యం సేవలందిస్తూ మహమ్మారి బారిన పడి వైద్యసిబ్బంది ప్రాణాలొదులుతున్నారు. తాజాగా హైదరాబాద్​ నాంపల్లిలోని నీలోఫర్ ఆస్పత్రిలో పనిచేస్తున్న హెడ్ నర్స్ వైరస్ బారినపడి మృతి చెందారు.

By

Published : May 8, 2021, 1:00 PM IST

nilofer hospital, corona effect on medical staff
వైద్య సిబ్బందిపై కరోనా ప్రభావం, వైద్య సిబ్బందిపై కరోనా ఎఫెక్ట్, కరోనాతో నీలోఫర్ హెడ్​నర్స్ మృతి

కరోనా రోగులకు సేవలందిస్తూ అదే వైరస్ బారినపడి ఎంతో మంది వైద్యసిబ్బంది అసువులు బాస్తున్నారు. ప్రాణాలకు తెగించి మరి బాధితులకు అండగా నిలుస్తున్న వారు మహమ్మారికి బలైపోతున్నారు. తాజాగా హైదరాబాద్ నాంపల్లిలోని నీలోఫర్ ఆస్పత్రిలో పనిచేస్తున్న హెడ్ నర్స్ వైరస్ బారిన పడి మృతి చెందారు.

నీలోఫర్ ఎమర్జెన్సీ వార్డులో.. హెడ్​నర్స్​గా విధులు నిర్వహిస్తున్న స్వరూపరాణి.. గతవారం పాజిటివ్ రావడం వల్ల ఆస్పత్రిలో చేరారు. సైఫాబాద్​లోని మహావీర్ ఆస్పత్రిలో కొవిడ్​ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నీలోఫర్​లో ఇప్పటికే.. దాదాపు 60 మంది సిబ్బంది వైరస్ బారిన పడ్డారు.

ABOUT THE AUTHOR

...view details