తెలంగాణ

telangana

By

Published : May 2, 2021, 4:54 AM IST

ETV Bharat / crime

కరోనాతో యువకుడు మృతి.. జేసీబీ సహాయంతో దహన సంస్కారాలు

కరోనా ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపడమే కాదు.. ఆఖరి చూపులనూ దూరం చేస్తోంది. కొవిడ్​ కాటుకు బలవుతోన్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. యాదాద్రి జిల్లాలో వైరస్​ సోకి ఓ యువకుడు మృతి చెందగా.. కుటుంబసభ్యులు జేసీబీ సహాయంతో దహన సంస్కారాలు నిర్వహించారు. రోజూ ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు.

కరోనాతో యువకుడు మృతి
కరోనాతో యువకుడు మృతి

కరోనాతో యువకుడు మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం రావిపహాడ్​లో మైలారం నరేశ్​ అనే ఓ యువకుడు కొవిడ్​కు బలయ్యాడు. కరోనా మృతి కావటంతో కుటుంబసభ్యులు పీపీఈ కిట్లు ధరించి మృతదేహాన్ని జేసీబీలోకి ఎక్కించారు. అనంతరం గ్రామ శివారులో దహన సంస్కారాలను పూర్తి చేశారు.

మృతుడు నరేశ్​ ఉప్పల్​లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండగా.. 10 రోజుల కిందట పాజిటివ్​గా నిర్ధారణ అయింది. ఫలితంగా రావిపహాడ్ చేరుకొని, ఇంట్లోనే హోం ఐసోలేషన్​లో ఉంటుండగా.. తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందాడు. నరేశ్​కు వివాహమై ఏడాది కూడా పూర్తి కాలేదని, భార్య ప్రస్తుతం గర్భవతి అని బంధువులు తెలిపారు.

ఇదీ చూడండి:జవహార్​నగర్​ ఆరో డివిజన్​ కార్పొరేటర్​పై అత్యాచారం కేసు

ABOUT THE AUTHOR

...view details