తెలంగాణ

telangana

గుండెపోటుతో కానిస్టేబుల్ హఠాన్మరణం

By

Published : Jun 8, 2021, 9:29 AM IST

విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్​ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా... చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈఘటన నిర్మల్​ జిల్లా నర్సాపూర్​ (జి) ఠాణాలో జరిగింది.

Telangana news
నిర్మల్​ జిల్లా వార్తలు

నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) పోలీస్ స్టేషన్​లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ మేస్రం రాము గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. తోటి సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

కానిస్టేబుల్​ మృతి విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ సీహెచ్ ప్రవీణ్ కుమార్... ఆస్పత్రికి వెళ్లి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వపరంగా అందాల్సిన బెనిఫిట్లను తక్షణమే అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఇదీ చూడండి:suicide: యువతి సూసైడ్​.. లభించని మృతదేహం

ABOUT THE AUTHOR

...view details