తెలంగాణ

telangana

ETV Bharat / crime

క్రికెట్​ ఆడుతుండగా ఘర్షణ.. విద్యార్థికి గాయాలు - attack on student in nandigama private school

క్రికెట్​ ఆడుతుండగా కొందరు విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో ఓ బాలుడికి గాయాలయ్యాయి. సంగారెడ్డి జిల్లా నందిగామలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది.

nandigama
నందిగామ

By

Published : Mar 4, 2021, 1:31 PM IST

సంగారెడ్డి జిల్లా నందిగామలోని ఓ ప్రైవేటు పాఠశాలలో కొందరు విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో పదోతరగతి బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. పాఠశాల ఆవరణలో పిల్లలు క్రికెట్​ ఆడుతుండగా వారి మధ్య చిన్నపాటి గొడవ చోటుచేసుకుంది. అది కాస్త పెద్దది కావడంతో ఒక టీం విద్యార్థులు మరో టీం విద్యార్థి కాలిపై క్రికెట్​ బ్యాట్​తో దాడి చేశారు.

అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం.. గాయాలతో ఉన్న బాలుడిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించింది. దీనిపై బాధితుని తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదుచేశారు.

ఇదీ చదవండి:చేతికొచ్చిన పంటకు నిప్పంటించిన దుండగులు

ABOUT THE AUTHOR

...view details