జగిత్యాల బైపాస్ రహదారిలో లాక్డౌన్ విధులు నిర్వహిస్తుండగా బైక్పై వేగంగా వచ్చిన ఓ యువకుడు పోలీసులను ఢీ కొట్టాడు. ఘటనలో జగిత్యాల డీఎస్పీ వెంకటరమణ, రూరల్ సీఐ కృష్ణ కుమార్లు స్వల్పంగా గాయపడ్డారు.
Accident: బైక్పై వేగంగా వచ్చి.. పోలీసులనే ఢీకొట్టి.. - Telangana news today
బైక్పై వేగంగా వచ్చిన ఓ యువకుడు పోలీసులను ఢీ కొట్టాడు. ప్రమాదంలో ఓ డీఎస్పీ, సీఐతోపాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన జగిత్యాల బైపాస్ రోడ్డులో చోటుచేసుకుంది.

accident: బైక్పై వేగంగా వచ్చి పోలీసులకు ఢీ
అక్కడే ఉన్న ఆముద రాజు, రాజశేఖర్ అనే యువకులు సైతం తీవ్రంగా గాయపడ్డారు. వారిలో రాజశేఖర్ కాలు విరిగినట్లు సమాచారం. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. యాక్సిడెంట్ చేసిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అడ్డుకుంటారనే భయంతోనే యువకడు వేగంగా వచ్చి ప్రమాదవశాత్తు ఢీ కొట్టినట్లు పోలీసులు చెబుతున్నారు.