తెలంగాణ

telangana

By

Published : Jun 12, 2021, 10:10 AM IST

Updated : Jun 12, 2021, 1:15 PM IST

ETV Bharat / crime

సెల్​ ఫోన్ల దొంగ.. సీసీ కెమెరాలో చిక్కాడు..!

ఏపీలోని కర్నూలు జిల్లా ఆదోనిలో సెల్​ ఫోన్​ దొంగను సీసీ కెమెరాలు పట్టించాయి. ఆదోనిలోని రద్దీ ప్రాంతాల్లోని దుకాణాల్లో గుట్టుచప్పుడు కాకుండా చోరీ చేస్తున్న దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు.

cell phone theft caught by cc cameras
సీసీ కెమెరాల్లో చిక్కిన సెల్​ఫోన్​ దొంగ

ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా ఆదోనిలో సెల్​ఫోన్ దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొంగ నుంచి లక్ష రూపాయలు విలువ చేసే 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ఒకటో పట్టణ పోలీసులు తెలిపారు. ఆదోనిలోని రద్దీ ప్రాంతాల్లోని దుకాణాల్లో గుట్టుచప్పుడు కాకుండా చరవాణులు చోరీ చేసే దొంగను సీసీ కెమెరా ఆధారంగా పట్టుకున్నామని వెల్లడించారు.

స్థానిక జీబీ కాంప్లెక్స్‌లో ఉన్న నినాయక స్టీల్‌ షాపులో గేవారామ్‌ అనే వ్యక్తికి చెందిన వీవో ఎక్స్‌-50 సెల్‌ఫోన్‌ను ఈ నెల 5న ఓ గుర్తుతెలియని యువకుడు దొంగతనం చేశాడు. దీనిపై బాధితుడు ఒకటో పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు స్టీల్‌ షాపులో ఓ యువకుడు దొంగతనం చేస్తుండగా సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలను సేకరించారు. చోరీకి పాల్పడింది ఎస్కేడీ కాలనీకి చెందిన బి.వీరేష్‌గా గుర్తించి అరెస్టు చేశారు.

అతని వద్ద నుంచి రూ.లక్ష విలువ చేసే 8 విలువైన చరవాణులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి మాటలు రావని, వినికిడి లోపం ఉందని.. చాకచక్యంగా దుకాణాల్లోని చరవాణులు, ఇతర వస్తువుల దొంగతనానికి పాల్పడుతుంటాడని విచారణలో తేలింది. గతంలోనూ ఇతనిపై కేసులు నమోదయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సెల్​ ఫోన్ల దొంగ.. సీసీ కెమెరాలో చిక్కాడు..!

ఇదీ చదవండి:EATALA: ఎమ్మెల్యే పదవికి ఇవాళ రాజీనామా చేయనున్న ఈటల!

Last Updated : Jun 12, 2021, 1:15 PM IST

ABOUT THE AUTHOR

...view details