తెలంగాణ

telangana

ETV Bharat / crime

కర్నూలులో చెక్‌పోస్ట్ వద్ద రూ.90 లక్షలు పట్టివేత

ఏపీలోని కర్నూలు జిల్లా పంచలింగాల చెక్‌పోస్టు వద్ద ఎస్​ఈబీ అధికారులు రూ.90లక్షలు భారీ నగదును పట్టుకున్నారు. ప్రైవేట్‌ బస్సులో డబ్బును తరలిస్తుండగా అధికారులు గుర్తించారు.

By

Published : Aug 1, 2021, 2:07 PM IST

cash-seize-in-check-post-in-kurnool-district
కర్నూలులో చెక్‌పోస్ట్ వద్ద రూ.90 లక్షలు పట్టివేత

ఏపీలోని కర్నూలులోని రాష్ట్ర సరిహద్దు పంచలింగాల చెక్ పోస్టు వద్ద ఎస్​ఈబీ అధికారులు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. వాహనాలను తనిఖీ చేస్తుండగా.. ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో 90 లక్షల నగదును బ్యాగుల్లో గుర్తించారు. కర్ణాటకకు చెందిన ఇద్దరు వ్యక్తులు వీటిని తీసుకెళ్తున్నట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవన్నారు. సొమ్మును స్వాధీనం చేసుకొని తాలూకా పోలీస్ స్టేషన్​కు అప్పగించామని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details