తెరాస సామాజిక మాధ్యమాల కన్వీనర్ క్రిశాంక్పై భాజపా ఐటీ సెల్ కన్వీనర్ వెంకటరమణ ఫిర్యాదు చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై తప్పుడు ప్రచారం చేసినట్లు సైబర్ క్రైం పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు.
బండి సంజయ్పై తప్పుడు ప్రచారం!.. సైబర్ పోలీసులకు భాజపా ఫిర్యాదు - తెలంగాణ నేరవార్తలు
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆ పార్టీ ఐటీ సెల్ ఫిర్యాదు చేసింది. తెరాస సామాజిక మాధ్యమాల కన్వీనర్పై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైం పోలీసులను కోరినట్లు తెలిపింది.

బండి సంజయ్పై తప్పుడు ప్రచారం!.. సైబర్ క్రైంకు భాజపా ఫిర్యాదు
సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సైబర్ క్రైం పోలీసులు చెప్పారని.. వెంటరమణ తెలిపారు.
ఇవీచూడండి:టీఎస్పీఎస్సీ పేరిట నకిలీ మెయిల్..