ఆదివారం రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం పరిధిలోని ఫరూఖ్నగర్ మండలం రాయికల్ టోల్ ప్లాజా వద్ద ఓ ఎమ్మెల్యే అనుచరులు హల్ చల్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు.. ఎమ్మెల్యే అనుచరులపై పలు సెక్షన్ల కింద (Cr. No 893/2021 u/s 341, 353, 506,290 r/w 34 IPC) కేసు నమోదు చేశారు.
అసలేం జరిగిందంటే..
తమ వాహనానికి ఆర్టీసీ డ్రైవర్ దారి ఇవ్వలేదని ఎమ్మెల్యే అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వనపర్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి వనపర్తికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. రాయికల్ టోల్ ప్లాజా సమీపంలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఆర్టీసీ డ్రైవర్ బీఆర్ రెడ్డి.. ఎమ్మెల్యే వాహనానికి దారి ఇవ్వలేకపోయారు. దీంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే అనుచరులు బస్సుకు అడ్డంగా తమ వాహనాన్ని అడ్డుగా పెట్టారు. డ్రైవర్ను దుర్భాషలాడారు. ఈ ఘటనను తోటి ప్రయాణికులు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు.