Car Burnt On Highway: ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా నక్కపల్లి మండలం ఉద్దండపురం జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. రహదారిపై వెళ్తున్న రెండు కార్లు ఢీ కొన్నాయి. విశాఖ నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న కారును.. అదే మార్గంలో వెళ్తున్న మరో కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది.
Car Burnt On Highway: రెండు కార్లు ఢీ.. చెలరేగిన మంటలు - విశాఖలో కారు దగ్ధం
Car Burnt On Highway: జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్న ఘటన ఏపీలోని విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది. ఓ కారులో మంటలు చెలరేగాయి. ప్రయాణికులు అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది.
![Car Burnt On Highway: రెండు కార్లు ఢీ.. చెలరేగిన మంటలు Car Burnt On Highway](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14680583-357-14680583-1646812366287.jpg)
విశాఖ జిల్లాలో రెండు కార్లు ఢీ
ఘటనలో దగ్ధమవుతున్న కార్లు
ఈ ఘటనతో ఓ కారులో మంటలు చెలరేగాయి. అందులోని ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై బయటకు దిగటంతో.. తృటిలో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకొని మంటలార్పారు.
ఇదీ చదవండి :Karvy Scam Updates : కార్వీ సంస్థ స్థిరాస్తులను అటాచ్ చేసిన ఈడీ