హైదరాబాద్లోని చిక్కడపల్లి పోలీస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. పంజాబ్కు చెందిన సద్నాం సింగ్ హైదరాబాద్లోని చిక్కడపల్లి సూర్యనగర్లో అద్దెకుంటున్నాడు. ఇటీవల అతని బంధువుతో కలిసి చిక్కడపల్లి కళాశాల సమీపంలో పంజాబీ ఫుడ్ కోర్టు నిర్వహిస్తున్నాడు.
వ్యక్తి దారుణ హత్య... నిందితుడు అతనేనా? - క్రైమ్ వార్తలు
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుని సమీప బంధువే ఈ హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

వ్యక్తి దారుణ హత్య... నిందితుడు అతనేనా?
సద్నాం సింగ్ భార్య బల్జిత్ కౌర్ ఇంటికి వచ్చే సరికి రక్తం మడుగులో పడి ఉన్నాడు. వెంటనే ఆమె పోలీసులకు సమాచారం అందించగా... ఘటన స్థలానికి చేరుకొని సంబంధించిన సాక్ష్యాలను సేకరించారు. సద్నాం సింగ్ సమీప బంధువే రెండు కత్తులతో గొంతు కోసి హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపులు- ఆపేదెలా?
Last Updated : Apr 2, 2021, 11:17 PM IST