ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం బాట్లో కొత్తపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో అన్నాచెల్లెలు మృతి చెందారు. ఓ ద్విచక్ర వాహనదారుడు.. ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను తప్పించబోయి డివైడర్కు ఢీకొట్టాడు. ఘటనలో బైకుపై ఉన్న ఆ ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
డివైడర్ను ఢీకొట్టిన బైకు.. అన్నాచెల్లెలు మృతి - కొత్తపల్లి రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా శింగనమల మండలం చిన్నజలాలపురం గ్రామంలో విషాదం నెలకొంది. ఓ ద్విచక్రవాహనదారుడు.. బి. కొత్తపల్లి వద్ద ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను తప్పించబోయి డివైడర్ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో అన్నాచెల్లెలు మృతి చెందారు.
![డివైడర్ను ఢీకొట్టిన బైకు.. అన్నాచెల్లెలు మృతి ap crime news, anantapur district news today](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11375345-574-11375345-1618229172266.jpg)
డివైడర్ను ఢీకొట్టిన బైకు.. అన్నాచెల్లెలు మృతి
మృతులు శింగనమల మండలం చిన్న జలాలపురం గ్రామానికి చెందిన అన్నాచెల్లెలు.. భాస్కర్, గీతగా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరి మృతితో ఆ గ్రామంలో విషాదం నెలకొంది.
ఇదీ చూడండి:పాస్పోర్ట్ల కేసులో మరో ఇద్దరు అరెస్టు