సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారం గ్రామంలోని ఇటుకల బట్టీలో పనిచేసే ఒడిశా రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ ఘటన రెండురోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది.
అన్నారం గ్రామంలో శ్రీధర్కు చెందిన ఇటుకుల బట్టీలో ఒడిశాకు చెందిన హిమాన్షు పటేల్.. కార్మికుడిగా పని చేసేందుకు వచ్చాడు. ఈ నెల 11వ తేదీ రాత్రి 10 గంటలకు అతను కనిపించకుండా పోయాడు. అతని భార్య భీమాలి, తోటి కార్మికులు వెతికినా ఎక్కడా ఆచూకీ లభించలేదు.