తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఎన్నికల వేళ నాటు బాంబుల కలకలం.. - latest news in srikakulam

ఆంధ్రప్రదేశ్​లోని శ్రీకాకుళం జిల్లా కంచలి మండలం గొల్లకంచలి గ్రామంలో నాటు బాంబులు కలకలం సృష్టించాయి. పోలీసుల తనిఖీల్లో 40 నాటు బాంబులు వరకు లభ్యమయ్యాయి.

ఎన్నికల వేళ నాటు బాంబుల కలకలం..
ఎన్నికల వేళ నాటు బాంబుల కలకలం..

By

Published : Mar 4, 2021, 8:34 PM IST

ఎన్నికల వేళ నాటు బాంబుల కలకలం..

ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం గొల్ల కంచలి గ్రామంలో నాటు బాంబులు లభించాయి. మున్సిపల్​ ఎన్నికలు సమీపిస్తుండటంతో పలు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీ నిర్వహించారు. ఈ క్రమంలో 40 నాటు బాంబులు బయట పడ్డాయి. ఇటీవలే గ్రామంలో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఆధిపత్యం కోసం ఓ వర్గం వారు వీటిని ఒరిస్సా నుంచి తెప్పించినట్టు పోలీసులు భావిస్తున్నారు.

ఈ ఘటన విచారణ చేపట్టి వివరాలు వెల్లడిస్తామని కాశీబుగ్గ డీఎస్పీ శివరామి రెడ్డి తెలిపారు. అడవి పందులను చంపడానికి.. వీటిని వినియోగిస్తున్నట్లు పలువురు స్థానికులు చెబుతున్నారు. సంఘటన స్థలాన్ని కంచలి పోలీసులు పరిశీలించారు.

ఇదీ చదవండి:'మే నెలలో యాదాద్రి ఆలయం పునఃప్రారంభించే అవకాశం'

ABOUT THE AUTHOR

...view details