తెలంగాణ

telangana

ETV Bharat / crime

రసాయన పరిశ్రమలో పేలిన బాయిలర్.. ఇద్దరు మృతి

ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సర్పవరం రసాయన పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్థలంలో మంత్రి కన్నబాబు సహాయక చర్యలను పరిశీలించారు.

By

Published : Mar 11, 2021, 5:34 PM IST

boiler-explodes-in-chemical-industry-and-two-workers-died
రసాయన పరిశ్రమలో పేలిన బాయిలర్.. ఇద్దరు మృతి

ఆంధ్రప్రదేశ్​లోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సర్పవరం రసాయన పరిశ్రమలో బాయిలర్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

క్షతగాత్రులను మాధవపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాయిలర్‌ పేలడంతో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. విషయం తెలిసిన వెంటనే.. మంత్రి కన్నబాబు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు.

ఇదీ చదవండి:అదుపు తప్పి ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ

For All Latest Updates

TAGGED:

ap news

ABOUT THE AUTHOR

...view details