తెలంగాణ

telangana

ETV Bharat / crime

Gang of thieves: మంచిర్యాలలో బైక్ దొంగల ముఠా అరెస్ట్ - Manchiryal crime news

మంచిర్యాల జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న ద్విచక్ర వాహన దొంగల ముఠా (Gang of thieves)ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

దొంగల ముఠా అరెస్ట్
దొంగల ముఠా అరెస్ట్

By

Published : Jun 17, 2021, 4:06 PM IST

ద్విచక్ర వాహనాలను దొంగలిస్తున్న ముఠా (Gang of thieves) సభ్యులను మంచిర్యాల పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి రూ. 10 లక్షల విలువ చేసే లారీతో పాటు 7 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. మంచిర్యాలకు చెందిన పాత నేరస్థులు మహబూబ్, రవి, మరో బాల నేరస్థుడు ముగ్గురు కలిసి మెకానిక్ పని చేస్తూ వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో వీరంతా ఓ ముఠాగా ఏర్పడ్డారు.

ద్విచక్ర వాహనాలను దొంగిలించి వాటిని విక్రయించి వచ్చే నగదును సొమ్ము చేసుకుంటున్నారని పోలీసులు తెలిపారు. లారీతో పాటు 6 లారీ టైర్లు దొంగిలించారని పేర్కొన్నారు. దొంగలను సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పట్టుకున్నామని మంచిర్యాల ఏసీపీ వెల్లడించారు. మరో కేసులో మహారాష్ట్రకు చెందిన ఓ జేబుదొంగను కూడా అరెస్ట్ చేశామని వివరించారు.

ప్రజలందరూ వాహన దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రతి ఒక్కరు విధిగా తమ వాహనాలను సురక్షిత ప్రాంతాల్లో ఉంచి... ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. అనంతరం ఈ ముఠా సభ్యులను అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబరచిన పోలీసులకు రివార్డులతో అభినందించారు.

ఇదీ చదవండి: పల్లెల్లో త్వరలో 'గూగుల్' ఆక్సిజన్ ప్లాంట్లు

ABOUT THE AUTHOR

...view details