తెలంగాణ

telangana

ETV Bharat / crime

రెమ్​డెసివిర్​ను అధిక ధరలకు అమ్ముకుంటున్న వైద్యులు సస్పెండ్​ - bhadrachalam govt doctors suspended due to allegations of remdesivir illegal sellings

భద్రాచలం ప్రభుత్వాస్పత్రిలో రెమ్​డెసివిర్ ఇంజెక్షన్లను అధిక ధరలకు అమ్ముకుంటున్న ముగ్గురిని వైద్య విధాన పరిషత్​ అధికారులు సస్పెండ్​ చేశారు. ప్రభుత్వాస్పత్రులకు సర్కారు ఉచితంగా అందిస్తున్న ఈ ఇంజక్షన్లను కొందరు అక్రమంగా ప్రైవేట్​ ఆస్పత్రులకు రూ.లక్షలకు అమ్ముకుంటున్నారు.

bhadrachalam govt doctors suspended
భద్రాచలం ప్రభుత్వ వైద్యులు సస్పెండ్​

By

Published : May 8, 2021, 11:28 AM IST

రెమ్​డెసివిర్​ ఇంజెక్షన్లను ప్రైవేట్​ ఆస్పత్రులకు అధిక ధరలకు అమ్మి సొమ్ముచేసుకుంటున్న ప్రభుత్వ వైద్యులను వైద్యవిధాన పరిషత్​ అధికారులు సస్పెండ్​ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో రెమ్​డెసివిర్​ ఇంజక్షన్లను ప్రైవేట్​ ఆస్పత్రులకు తరలించారనే వివాదంలో భాగంగా వారిపై కేసు నమోదైంది.

ఏప్రిల్​ 29న ఆస్పత్రి వైద్యుడు కృష్ణ ప్రసాద్​, సూపరింటెండెంట్​ యుగంధర్​, ఫార్మాసిస్ట్​ శ్రీనివాసులుపై భద్రాచలం పోలీసులు విచారణ చేపట్టారు. ఆరోపణలు నిజం కావడంతో వారిపై కేసు నమోదు చేశారు. కృష్ణ ప్రసాద్​ను అరెస్ట్​ చేయగా, మిగిలిన ఇద్దరికీ కరోనా పాజిటివ్​ నిర్ధరణ కావడంతో విచారణ కొనసాగిస్తున్నారు.

ఇదీ చదవండి:టిమ్స్​కు క్యూ కడుతున్న కొవిడ్ రోగులు.. అందుబాటులో లేని సేవలు

ABOUT THE AUTHOR

...view details