తెలంగాణ

telangana

ETV Bharat / crime

ATTACK: కార్పొరేటర్‌ ఇంటిపై మేయర్‌ భర్త అనుచరుల దాడి - nizamabad district latest news

మేయర్‌ అనుచరులు, కార్పొరేటర్‌ మధ్య చిన్న వివాదం చిలికి చిలికి పెద్దదైంది. కార్పొరేటర్‌ ఇంటిపై దాడికి దారితీసింది. ఘటనలో కార్పొరేటర్‌ తమ్ముడికి తీవ్ర గాయాలు కాగా.. బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

కార్పొరేటర్‌ ఇంటిపై మేయర్‌ భర్త అనుచరుల దాడి
కార్పొరేటర్‌ ఇంటిపై మేయర్‌ భర్త అనుచరుల దాడి

By

Published : Jun 6, 2021, 10:05 AM IST

నిజామాబాద్ నగరపాలక సంస్థలోని ఓ కార్పొరేటర్ ఇంటిపై మేయర్ భర్త అనుచరులు దాడి చేశారు. ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 9వ డివిజన్ పరిధిలో శుక్రవారం మున్సిపాలిటీకి చెందిన చెత్త వాహనం ఇంద్రపూర్ రోడ్డులో ఓ టిప్పర్‌కు తగిలింది. దీంతో ఆ టిప్పర్ సంబంధీకులైన మేయర్ భర్త అనుచరులు మున్సిపల్ సిబ్బందితో గొడవకు దిగారు. ఫలితంగా మున్సిపల్‌ సిబ్బంది విషయాన్ని స్థానిక కార్పొరేటర్ సాయివర్ధన్‌ దృష్టికి తీసుకెళ్లారు. అక్కడికి చేరుకున్న కార్పొరేటర్ మేయర్ అనుచరులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలో మేయర్ అనుచరుడు నరేశ్‌, కార్పొరేటర్ సాయి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం ఇరువురూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఫోన్‌లో మరోసారి గొడవపడగా.. నరేశ్‌ మరో నలుగురితో కలిసి కార్పొరేటర్ సాయి ఇంటిపై దాడి చేశాడు. ఈ క్రమంలో కార్పొరేటర్ సాయి తమ్ముడు కర్ణవర్ధన్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

ఈ మేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేయర్ అనుచరులు ఐదుగురిపై ఐదో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే డివిజన్ నుంచి మేయర్ భర్తపై సాయివర్ధన్ భాజపా తరఫున పోటీ చేసి గెలిచారు.

ఇదీ చూడండి: Corona effect: కొడుకుపై కిరోసిన్​ పోసి.. ఆ తరువాత తనపై పోసుకొని.!

ABOUT THE AUTHOR

...view details