తెలంగాణ

telangana

ETV Bharat / crime

Annual crime report Telangana 2021 : '2021లో నేరాలు పెరిగాయ్.. 2022లో తగ్గించేస్తాం' - వరంగల్ వార్షిక నేర నివేదిక

Annual crime report Telangana 2021 : రాష్ట్రంలో వరంగల్, నిర్మల్, జగిత్యాల జిల్లాల వార్షిక నేర నివేదికలను అధికారులు విడుదల చేశారు. 2021లో నేరాలు పెరిగాయని.. వాటిని అదుపు చేయడమే లక్ష్యంగా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. మత్తుపదార్థ రహిత జిల్లాలుగా మార్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Annual crime report Telangana
Annual crime report Telangana

By

Published : Dec 31, 2021, 12:38 PM IST

Annual crime report Telangana 2021 : చారిత్రక నగరంగా పేరొందిన వరంగల్‌లో నేరాలు పెరిగినట్లు పోలీసు కమిషనర్‌ తరుణ్‌జోషి వెల్లడించారు. హత్యలు, కిడ్నాపులు, మహిళలపై నేరాలు గతేడాదితో పోలిస్తే.. ఈసారి 3.85శాతం ఎక్కువైనట్లు 2021 వార్షిక నేర నివేదిక విడుదల చేశారు. ప్రధానంగా అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఆగడాలు పెచ్చుమీరాయని తెలిపారు. 2020లో 10వేల 622 కేసులు నమోదవగా.. ఈసారి 11వేల 47 కేసులు నమోదయ్యాయని చెప్పారు.

వరంగల్​లో నేరాలు పెరిగాయి..

Warangal Annual crime report 2021 : ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి నేరాలు చేసే 7 ముఠాలను పట్టుకుని.. కోటి 9 లక్షల 62 వేల రూపాయల విలువైన బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ సీపీ తరుణ్‌జోషి తెలిపారు. గతేడాదితో పోలిస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు మూడు రెట్లు, సైబర్‌ నేరాలు 29 శాతం పెరిగాయని స్పష్టం చేశారు. వీటి కట్టడికి పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామని.. బాధితులు జాప్యం చేయకుండా తమ దృష్టికి తీసుకువస్తే నిందితులను పట్టుకోగలమని చెప్పారు. వరంగల్‌ను మత్తుపదార్థ రహిత నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు.

అల్లర్లు ఎక్కువయ్యాయి..

Nirmal Annual crime report 2021 : గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం జిల్లాలో నమోదైన నేరాలు, కేసుల సంఖ్య ఎక్కువేనని నిర్మల్‌ జిల్లా ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌ స్పష్టం చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన వార్షిక నేర సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన.. శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు చేపట్టామన్నారు. భైంసాలో ప్రత్యేక సబ్ హెడ్ క్వార్టర్ ఏర్పాటు చేసి అదనపు సిబ్బందిని అందుబాటులో ఉంచామని తెలిపారు. గతంలో జరిగిన అల్లర్లతో ప్రమేయమున్న 8 మందిపై పీడీ యాక్టు నమోదు చేశామని చెప్పారు.

అత్యాచారాలే అధికం..

Jagtial Annual crime report 2021 : జగిత్యాల జిల్లాలో ఈ ఏడాది 25 హత్య కేసులు నమోదు కాగా.. 49 అత్యాచార కేసులు నమోదయ్యాయని జిల్లా ఎస్పీ సింధూశర్మ వెల్లడించారు. గతంలో కంటే ప్రజలు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయడం పెరిగిందని.. ఇది శుభపరిణామం అని తెలిపారు. మద్యం తాగి వాహనం నడిపిన కేసులు 4వేలు నమోదు కాగా.. ఈ-చలానాలు 2లక్షల 55వేలు నమోదయ్యాయని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details