తెలంగాణ

telangana

ETV Bharat / crime

కుళ్లిపోయిన స్థితిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం - yadadri district latest news

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు బైపాస్‌ రోడ్డులోని పెద్దవాగు వంతెన కింద గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

an unidentified woman dead body was found in yadadri district
కుళ్లిపోయిన స్థితిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం.. కేసు నమోదు

By

Published : Feb 22, 2021, 5:14 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు బైపాస్ రోడ్డులోని వంతెన కింద ఓ గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. పెద్దవాగు వంతెన కింద గోనె సంచిలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ నర్సింహరెడ్డి ఘటనా స్థలిని పర్యవేక్షించారు. మృతురాలికి సుమారు 35 నుంచి 45 ఏళ్ల వయసు ఉంటుందని, కుడిచేతిపై యాదమ్మ అని పచ్చబొట్టు ఉందని పోలీసులు తెలిపారు. క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌ సాయంతో విచారిస్తున్నట్లు వెల్లడించారు.

మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉండటం వల్ల నాలుగైదు రోజుల క్రితమే చనిపోయినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మహిళ గురించి తెలిసిన వారు తమకు సమాచారం అందించాలని కోరారు.

ఇదీ చూడండి: టిప్పర్​ ఢీకొని.. హైదరాబాద్​లో నేపాల్​ దంపతుల దుర్మరణం

ABOUT THE AUTHOR

...view details