తెలంగాణ

telangana

ETV Bharat / crime

పోచారం జలాశయంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం - తెలంగాణ వార్తలు

కామారెడ్డి జిల్లా పోచారం జలాశయంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. జాలర్లు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని వెలికితీసి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

An unidentified body was found in Pocharam, dead body found in reservoir
పోచారం జలాశయంలో మృతదేహం లభ్యం, మృతదేహం లభ్యం

By

Published : May 11, 2021, 3:05 PM IST

కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం జలాశయంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. జాలర్లు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్న పోలీసులు... స్థానికుల సాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడి వయసు 40 నుంచి 45 ఏళ్లు ఉంటాయని... నలుపు రంగు ప్యాంటు, ఎరుపు రంగు చెక్స్ ఉన్న దుస్తులు ధరించారని తెలిపారు.

స్థానికంగా ఓ సైకిల్ పార్క్ చేసి ఉందని... సైకిల్ పై 'నింగి రాజు బంజరు' అని రాసి ఉందని పోలీసులు తెలిపారు. వివరాలు తెలిస్తే నాగిరెడ్డిపేట పోలీస్ స్టేషన్​కు సమాచారం అందించాలని ఎస్సై రాజయ్య తెలిపారు. మరిన్ని వివరాలకు 9440795466 నంబర్​కు ఫోన్ చేయల్సిందిగా కోరారు.

ఇదీ చదవండి:ధాన్యం లారీని ఢీకొన్న బైక్.. ఒకరు మృతి

ABOUT THE AUTHOR

...view details