తెలంగాణ

telangana

By

Published : Apr 4, 2021, 2:06 PM IST

ETV Bharat / crime

జవహర్​నగర్ పీఎస్ పరిధిలో గుర్తుతెలియని శవం లభ్యం

సికింద్రాబాద్ జవహర్ నగర్ పోలీస్​స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Jawahar Nagar PS area
Jawahar Nagar PS area

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం చెరువులో లభ్యమైన ఘటన సికింద్రాబాద్ జవహర్​నగర్ పోలీస్​స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానిక చెన్నపురం చెరువులో గుర్తు తెలియని మృతదేహం తేలియాడుతూ కనబడగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీశారు.

వ్యక్తికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేకపోవడం వల్ల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. చనిపోవడానికి గల కారణాలను అన్ని కోణాల్లో విశ్లేషిస్తున్నారు.

ఇదీ చూడండి:ప్రైవేటు వైద్య కళాశాలల్లోనూ ఉచిత ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు

ABOUT THE AUTHOR

...view details