సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం మద్రిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఘటనకు భూ వివాదాలే కారణమైనట్లు తెలుస్తోంది. హైదరాబాద్లో నివాసం ఉండే జహీర్(42).. సొంతూరులోని పొలం చూసేందుకు వచ్చాడు. గుర్తు తెలియని దుండగులు జహీర్ వస్తోన్న కారుని అడ్డుకుని.. అతడిపై ఒక్కసారిగా దాడికి దిగారు.
Brutal murder: కారుని అడ్డుకుని.. కత్తులతో పొడిచి దారుణ హత్య - Land fights
గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చిన ఘటన సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలో చోటుచేసుకుంది. ఘటనా స్థలాన్ని సందర్శించిన జహీరాబాద్ సీఐ.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భూ పంపిణీ విషయంలో తలెత్తిన వివాదాలే హత్యకు దారి తీసినట్లు సమాచారం.
![Brutal murder: కారుని అడ్డుకుని.. కత్తులతో పొడిచి దారుణ హత్య Brutal murder](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-06:42:19:1624194739-tg-srd-26-20-vyakti-daruna-hatya-av-ts10059-20062021174054-2006f-1624191054-885.jpg)
Brutal murder
కత్తులతో గొంతు, కడుపు, ఎద భాగంలో దారుణంగా పొడిచి హతమార్చారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన జహీరాబాద్ సీఐ రాజశేఖర్.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: Rape attempt: ప్రసవానికి వచ్చిన మహిళపై అత్యాచారయత్నం