తెలంగాణ

telangana

By

Published : May 24, 2021, 7:40 PM IST

ETV Bharat / crime

మరో మరణం: బ్లాక్​ ఫంగస్​తో వృద్ధురాలి మృతి

రాష్ట్రంలో బ్లాక్​ ఫంగస్​ మరణాలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా నిర్మల్‌ జిల్లాలో ఓ వృద్ధురాలు బ్లాక్​ ఫంగస్​తో మృతి చెందింది. కరోనాను జయించినా.. ఫంగస్​ను ఎదుర్కోలేక ప్రాణాలు విడిచింది.

బ్లాక్​ ఫంగస్​తో వృద్ధురాలి మృతి
బ్లాక్​ ఫంగస్​తో వృద్ధురాలి మృతి

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని రాహుల్‌ నగర్‌లో బ్లాక్‌ ఫంగస్‌తో గజన్‌ బాయి అనే వృద్ధురాలు మృతి చెందింది. కోతుల్గాం గ్రామానికి చెందిన గజన్ బాయికి గత నెలలో కరోనా సోకగా.. పట్టణంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందింది. వైరస్‌ను జయించి ఈ నెల 5న ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జీ అయింది.

కొన్ని రోజుల క్రితం జ్వరం రావడంతో ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. ఎంతకూ తగ్గకపోవడంతో 5 రోజుల క్రితం నిజామాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో పరీక్షలు చేయించారు. వైద్యులు బ్లాక్ ఫంగస్‌గా నిర్ధారించారు. ఆసుపత్రిలో చేర్పించలేక ఇంటి వద్దే చికిత్స అందిస్తుండగా.. పరిస్థితి విషమించి మృతి చెందింది.

ఇదీ చూడండి: మేమున్నామంటూ... కరోనా బాధితులకు ఇంటివద్దకే భోజనం

ABOUT THE AUTHOR

...view details