వేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి బైక్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఓ వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదం యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి శివారులో జరిగింది.
Accident: బైక్ను ఢీకొన్న కారు.. వృద్ధుడు మృతి - రోడ్డు ప్రమాదాలు కారణాలు
యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ కారు.. బైక్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఓ వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
![Accident: బైక్ను ఢీకొన్న కారు.. వృద్ధుడు మృతి road accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-01:26:33:1623657393-tg-nlg-82-14-road-accident-av-ts10134-14062021131721-1406f-1623656841-266.jpg)
road accident
మృతుడు రామాజీపేటకు చెందిన అయిలయ్య (70)గా పోలీసులు గుర్తించారు. కారు డ్రైవర్.. యాదగిరిగుట్ట పీఎస్లో లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భువనగిరి ఏరియా హాస్పిటల్కు తరలించారు.
ఇదీ చదవండి:LADY SI: మహిళా ఎస్సై ఆత్మహత్యాయత్నం.. ప్రేమ వ్యవహారమే కారణం..?