తెలంగాణ

telangana

By

Published : Apr 30, 2021, 8:13 PM IST

ETV Bharat / crime

మతిస్తిమితం లేని మహిళ ఆత్మహత్య

ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ మహిళ ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగింది. మృతురాలికి కొద్ది రోజులుగా మానసిక పరిస్థితి సరిగా లేదని ఆమె భర్త తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

An insane woman commits suicide
మతి స్థిమితం లేని మహిళ ఆత్మహత్య

మతి స్తిమితం లేని ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం పోచంపల్లి గ్రామంలో జరిగింది. మృతురాలి సవతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

జిల్లాలోని పోచంపల్లి గ్రామానికి చెందిన దయ్యాల స్రవంతి (32) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. మానసిన పరిస్థితి సరిగా లేకపోవడంతో భర్త కుమార్ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె భర్త తెలిపారు.

మృతురాలికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రేగొండ ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ గౌడ్ తెలిపారు.

ఇదీ చదవండి:అంబులెన్స్ డ్రైవర్​గా మారిన నటుడు.. ఎందుకంటే?

ABOUT THE AUTHOR

...view details