విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ.. ఓ మహిళను ఓ ఏజెంట్ ట్రాప్ చేశాడు. ఏజెంట్ మాయ మాటలను నమ్మిన ఆ మహిళ దుబాయ్కి వెళ్లింది. అక్కడికి వెళ్లాకే.. తనను అమ్మేశారని తెలుసుకుంది.
బాధితురాలితో అరబ్షేక్లు వ్యభిచారం చేయించారు. అక్కడి నుంచి చాకచక్యంగా తప్పించుకొని ఇండియాకు చేరుకున్న బాధితురాలు... ఏంజెట్ రహీంపై శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుబాయ్లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ దుబాయ్ షేక్లకు అమ్మివేసినట్లు ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది.