తెలంగాణ

telangana

By

Published : Apr 16, 2021, 10:06 AM IST

ETV Bharat / crime

రోడ్డు పక్కనున్నవారిపైనుంచి దూసుకెళ్లిన లారీ... ముగ్గురు మృతి

ఏపీలోని గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఉన్నవారిపై సిమెంట్​ లారీ దూసుకెళ్లింది. ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

Guntur crime
Guntur accident

ఏపీలోని గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడు వద్ద జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. 2 లారీలు ఓవర్‌టేక్ చేసే క్రమంలో ఒకదానికొకటి రాసుకున్నాయి.
రహదారి పక్కన లారీలను ఆపి డ్రైవర్లు వాగ్వాదానికి దిగారు. డ్రైవర్లకు సర్దిచెప్పేందుకు స్థానికుడు సీతారామయ్య వెళ్లారు. ఈ ఘటనలో ముగ్గురిపై సిమెంట్ లారీ దూసుకెళ్లింది.

ABOUT THE AUTHOR

...view details