తెలంగాణ

telangana

ETV Bharat / crime

గోదావరిలో దూకి మహిళ ఆత్మహత్యాయత్నం.. కాపాడిన రెస్క్యూ టీం - Peddapalli District Latest News

గోదావరిఖని గోదావరిలో దూకి ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అక్కడే విధులు నిర్వహిస్తున్న రెస్క్యూ టీం కాపాడారు. ఆమెను కుటుంబసభ్యులకు అప్పజెప్పారు.

Young woman commits suicide in Godavari
గోదావరిలో యువతి ఆత్మహత్యాయత్నం

By

Published : Mar 12, 2021, 5:16 AM IST

కుటుంబ కలహలతో ఓ మహిళ పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గోదావరిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. అక్కడ ఉన్న రివర్ గార్డ్స్, రెస్క్యూ సిబ్బంది తాడు సహయంతో ఆమెను కాపాడారు.

తాడుతో మహిళను కాపాడుతున్న రెస్క్యూ సిబ్బంది

మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం కాసిపేటకు చెందిన దాసరి శోభ అనే వివాహిత కుటుంబ గొడవలతో గోదావరిలో దూకింది. శివరాత్రి సందర్భంగా అక్కడే విధులు నిర్వహిస్తున్న రెస్క్యూ టీంకు చెందినా వ్యక్తి మునిగిపోతున్న మహిళను తాడుతో రక్షించారు.

జాలర్లు పడవ సహయంతో ఆమెను ఓడ్డుకు చేర్చి.. చికిత్స కోసం గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ తరువాత కుటుంబసభ్యులకు అప్పజెప్పారు.

ఇదీ చూడండి:నీటి వాల్వును ఢీకొన్న ద్విచక్రవాహనం... ఇద్దరు మృతి

ABOUT THE AUTHOR

...view details