మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం చిన్న ముప్పారం శివారు పెద్ద తండాలో విషాద ఘటన చోటుచేసుకుంది. వరి పొలంలో దమ్ము చేస్తుండగా ట్రాక్టర్ బోల్తా పడింది. ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ సాగర్ ప్రాణాలు కోల్పోయాడు.
దమ్ము చేస్తుండగా ట్రాక్టర్ బోల్తా... యువకుడు మృతి - వరిపొలంలో ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి
వరి పొలం దమ్ము చేస్తుండగా ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. జేసీబీ సాయంతో ట్రాక్టర్ను లేపి యువకుడి మృతదేహాన్ని వెలికితీశారు.
![దమ్ము చేస్తుండగా ట్రాక్టర్ బోల్తా... యువకుడు మృతి దమ్ము చేస్తుండగా ట్రాక్టర్ బోల్తా... యువకుడు మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10301991-thumbnail-3x2-tractor-rk.jpg)
దమ్ము చేస్తుండగా ట్రాక్టర్ బోల్తా... యువకుడు మృతి
జేసీబీ సాయంతో ట్రాక్టర్ను లేపి యువకుడి మృతదేహాన్ని వెలికితీశారు. సాగర్ అదే గ్రామంలో కొంతకాలంగా ట్రాక్టర్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడని స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:కొడుకుకు నిప్పంటించిన తండ్రి అరెస్ట్