కంకర క్వారీలో ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ప్రమాదం వనపర్తి జిల్లా రేవల్లి మండల కేంద్రంలో జరిగింది.
ట్రాక్టర్ బోల్తా.. యువకుడు మృతి - రోడ్డు ప్రమాదాలు మరణాలు
వనపర్తి జిల్లా రేవల్లి మండల కేంద్రంలో అదుపుతప్పి ఓ ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
![ట్రాక్టర్ బోల్తా.. యువకుడు మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-08:17:44:1623552464-12110330-ns.jpg)
Tractor overturned
స్థానికులు.. క్షతగాత్రులను మహబూబ్నగర్ జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:మాంసం కోసం కిరాతకం.. ప్రాణంతో ఉన్న పాడిగేదెల తొడలు కోసి..!