వేగంగా వచ్చిన ఓ బైక్.. అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్ నగర శివారు రాజేంద్రనగర్లోని పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవేపై జరిగింది.
Accident: డివైడర్ను ఢీకొట్టిన బైక్.. వ్యక్తి మృతి - రోడ్డు ప్రమాదాలు కారణాలు
హైదరాబాద్ నగర శివారు రాజేంద్రనగర్లోని పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవేపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఓ బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
![Accident: డివైడర్ను ఢీకొట్టిన బైక్.. వ్యక్తి మృతి road accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-rjrnr-1406newsroom-1623636775-411.jpg)
road accident
మృతుడు ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన వంశీ కృష్ణారెడ్డిగా పోలీసులు గుర్తించారు. యువకుడు.. నిబంధనలకు విరుద్ధంగా హైవేపై ద్విచక్రవాహనాలకు అనుమతి లేకున్నా, హెల్మెట్ సైతం ధరించకుండా వెళ్లి ప్రమాదానికి గురైనట్లు తెలిపారు.
ఇదీ చదవండి:Murder: తండ్రిని చంపారని పగపెంచుకున్నారు.. ఏడాది తర్వాత రివైంజ్