తెలంగాణ

telangana

By

Published : May 16, 2021, 7:32 PM IST

ETV Bharat / crime

మందేసి..హోర్డింగ్ ఎక్కి..రచ్చరచ్చ

మద్యం మత్తులో హోర్డింగ్ ఎక్కిన ఓ యువకుడు.. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ హల్ చల్ చేశాడు. ఈ ఘటన నిజామాబాద్ నగరంలో జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. అతడికి నచ్చజెప్పి కిందకు దించారు.

young man Intoxicated with alcohol
మద్యం మత్తులో హల్​చల్​

ఓ పోలీస్ కానిస్టేబుల్ తన వద్ద నుంచి బలవంతంగా డబ్బును లాక్కొన్నాడని ఆరోపిస్తూ ఓ యువకుడు తాగిన మైకంలో..హోర్డింగ్ ఎక్కి హల్ చల్ చేశాడు. ఈ ఘటన నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్ ప్రాంతంలో జరిగింది.

3వ టౌన్​లో కానిస్టేబుల్​గా విధులు నిర్వర్తిస్తోన్న యాదగిరి.. శనివారం రాత్రి తన వద్ద నుంచి రూ. 2 వేలను లాక్కొన్నాడని సదరు యువకుడు ఆరోపించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. అతడికి నగదును ఇప్పిస్తామని నచ్చజెప్పి కిందకు దించారు. అయినప్పటికీ ఆ యువకుడు ఆరోపణలను ఆపకపోవడంతో.. పోలీసులు అతడిని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు.

యువకుడిని పరిశీలించిన వైద్యులు.. అతడు తాగిన మైకంలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని చెప్పుకొచ్చారు. కానీ సదరు యువకుడు మాత్రం.. కానిస్టేబుల్ తన వద్ద నుంచి డబ్బులు తీసుకున్నాడని పదే పదే చెప్పడం గమనార్హం.

ఇదీ చదవండి: పెద్దలు ఒప్పుకోలేదని క్వారీలో దూకి ప్రేమజంట ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details