తెలంగాణ

telangana

By

Published : Apr 16, 2021, 11:47 AM IST

ETV Bharat / crime

'వరకట్నం కేసులో పోలీసులు లంచం అడుగుతున్నారు'

తమ సమస్యను పరిష్కారించాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తే తిరిగి వారే లంచం అడుగుతున్నారని ఓ మహిళ వాపోయింది. వరకట్నం వేధింపుల కేసు నమోదు చేయాలని కోరితే.... నిజామాబాద్‌ పోలీసులు లంచం అడుగుతున్నారని ఆరోపించింది.

women compliant on police
nizamabad

వరకట్నం వేధింపుల కేసు నమోదు చేయాలని కోరితే.... నిజామాబాద్‌ పోలీసులు లంచం అడుగుతున్నారని ఓ మహిళ ఆరోపించింది. నగరానికి చెందిన అర్చనకు సంగారెడ్డి జిల్లా వాసి ప్రణయ్‌తో 5 నెలల క్రితం వివాహం జరిగింది. పెళ్లైనా కొన్నిరోజులకే కట్నం కోసం భర్త వేధింపులకు గురిచేశాడని ఆమె తెలిపింది.

ఈ విషయంపై కేసు నమోదు చేయాలని పోలీస్‌ స్టేషన్‌కు వెళితే.... లక్ష రూపాయలు అడుగుతున్నారని ఆరోపించింది. అధికారులు చర్యలు తీసుకునే వరకు పోరాటం చేస్తామని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

'వరకట్నం కేసులో పోలీసులు లంచం అడుగుతున్నారు'

ఇదీ చూడండి:ఒకరోజు పోలీస్ కమిషనర్ సాదిక్ క్యాన్సర్​తో మృతి

ABOUT THE AUTHOR

...view details