కడుపునొప్పి తట్టుకోలేక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట పరిధిలో జరిగింది. జగద్గిరిగుట్ట మాక్డూమ్ నగర్కు చెందిన రాజేందర్ రెడ్డి (23) అనే విద్యార్థి గత కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు.
నొప్పి భరించలేక.. విషం తాగాడు - telangana crime news
కడుపునొప్పి భరించలేక ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది.
![నొప్పి భరించలేక.. విషం తాగాడు A student who could not bear the pain committed suicide. The tragic incident took place in Medchal district.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11099659-400-11099659-1616326804917.jpg)
శనివారం తీవ్రంగా కడుపునొప్పి రావడంతో భరించలేక విషం తాగాడు. కొద్దిసేపటికి అతని సోదరుడు గమనించగా రాజేందర్ రెడ్డి మంచంపై కడుపునొప్పి, వాంతులతో కొట్టుమిట్టాడుతున్నాడు. దీంతో హుటాహుటిన కూకట్పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు విషం సేవించినట్లుగా కుటుంబసభ్యులకు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం సోమాజిగూడా యశోద ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న జగద్గిరిగుట్ట పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:మ్యాడారంలో విద్యుదాఘాతంతో యువ రైతు మృతి