తెలంగాణ

telangana

ETV Bharat / crime

road accident: ఆగిఉన్న లారీని ఢీకొన్న ద్విచక్రవాహనం... ఇద్దరు మృతి - రంగారెడ్డి నేర వార్తలు

ఆగి ఉన్న టిప్పర్​ను ద్విచక్రవాహనం ఢీకొంది. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్​పేట పరిధి లక్ష్మారెడ్డిపాలెం వద్ద జరిగింది.

accident
accident

By

Published : Jul 26, 2021, 1:48 PM IST

రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట పరిధిలోని లక్ష్మారెడ్డిపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. రాజేశ్వర్‌ మార్బుల్‌ షాప్‌ పక్కన ఆగిన టిప్పర్‌ను ద్విచక్ర వాహనం ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై ఉన్న మస్తాన్‌(38), చంద్రయ్య(62) తీవ్రంగా గాయపడ్డారు.

మస్తాన్‌ అక్కడిక్కడే మృతి చెందగా, చంద్రయ్య వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:DRUNKEN DRIVE: మద్యం మత్తులో లారీ డ్రైవర్.. అరగంట పాటు బీభత్సం

ABOUT THE AUTHOR

...view details