భర్తతో గొడవపడిన ఓ మహిళ ఆ కోపాన్ని పిల్లలపై చూపింది. సనత్నగర్ ఠాణా పరిధి బోరబండ రామారావునగర్కు చెందిన పావని, రాజు దంపతులు. వీరికి జ్ఞానేశ్వర్, మహాలక్ష్మి ఇద్దరు పిల్లలు. ఈనెల 23న భర్తతో గొడవ పడిన పావని ఆ కోపాన్ని చిన్నారులపై ప్రదర్శించింది.
పిల్లలకు వాతలు పెట్టిన తల్లి అరెస్ట్ - హైదరాబాద్ నేర వార్తలు
భర్తపై కోపాన్ని ఓ మహిళ పిల్లలపై చూపించింది. చిన్న పిల్లలని చూడకుండా గిన్నె కాల్చి అరికాళ్లు, తొడలపై వాతలు పెట్టింది. ఈ ఘటన సనత్నగర్ ఠాణా పరిధిలో జరిగింది.
పిల్లలకు వాతలు పెట్టిన తల్లి అరెస్ట్
గిన్నెను కాల్చి పిల్లలిద్దరి అరికాళ్లు, తొడలపై వాతలు పెట్టింది. గమనించిన స్థానికులు తల్లిని మందలించారు. ఈ విషయాన్ని స్థానిక అంగన్వాడీ టీచర్ మేడ్చల్ జిల్లా కార్యాలయంలోని లీగల్ ప్రొఫెషనల్ అధికారికి తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పావనిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.