ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం ఆకులవారిఘణపురం గ్రామానికి చెందిన సాబీర్ కన్నాయిగూడెం మండలంలోని ఓ సంస్థలో దినసరి కూలీగా పని చేస్తున్నాడు. కరోనా నేపథ్యంలో గత 6 నెలలుగా యాజమాన్యం వేతనాలు ఇవ్వడం లేదు. ఫలితంగా తరచూ ఇంట్లో భార్యతో గొడవలు జరుగున్నాయి. ఈ క్రమంలోనే మనస్తాపానికి గురైన సాబీర్.. మద్యం మత్తులో విద్యుత్ స్తంభం ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అదృష్టవశాత్తు ఆ సమయంలో కరెంట్ లేకపోవడం వల్ల ప్రాణాపాయం తప్పింది.
డబ్బులు రాక.. ఇంట్లోపోరు పడలేక.. ఆత్మహత్యాయత్నం - telangana latest news
రోజూ పని చేస్తున్నా.. కూలీ డబ్బులు రావడం లేదు. పైసలు లేక తరచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. వీటన్నింటితో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి.. మద్యం సేవించి విద్యుత్ స్తంభం ఎక్కాడు. ఆత్మహత్య చేసుకుంటానంటూ హల్చల్ చేశారు. ఈ ఘటన ములుగు జిల్లాలో జరిగింది.

డబ్బులు రాక.. ఇంట్లోపోరు పడలేక.. ఆత్మహత్యాయత్నం
డబ్బులు రాక.. ఇంట్లోపోరు పడలేక.. ఆత్మహత్యాయత్నం
సాబీర్ సుమారు గంట పాటు స్తంభంపై హల్చల్ చేశాడు. స్థానికులు ఎంతనచ్చజెప్పినా వినలేదు. చివరికి పోలీసులు రంగప్రవేశం చేశారు. అతడికి నచ్చజెప్పి కిందకు దింపారు. కౌన్సెలింగ్ ఇచ్చేందుకు పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు.