తెలంగాణ

telangana

ETV Bharat / crime

రాత్రి వేళలో కత్తులతో విచక్షణారహిత దాడి.. వ్యక్తి మృతి - తెలంగాణ వార్తలు

జవహర్​నగర్​ పోలీసు స్టేషన్​ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. రాత్రి వేళలో గుర్తుతెలియని వ్యక్తులు రాజు అనే వ్యక్తిపై విచక్షణారహితంగా కత్తులతో దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

murder case, man stabbed by unknown people
జవహర్​నగర్​లో వ్యక్తి హత్య, వ్యక్తి దారుణ హత్య

By

Published : Apr 26, 2021, 6:52 AM IST

సికింద్రాబాద్​లోని జవహర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్​లో రాజు అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. రాత్రి 9 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారని మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన రాజు అక్కడికక్కడే మృతి చెందాడని పేర్కొన్నారు. మృతదేహం వద్ద బోరున విలపించారు.

కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని జవహర్ నగర్ పోలీసులు తెలిపారు. సీసీ పుటేజీని పరిశీలిస్తున్నారు. పాత కక్షలా? లేక ఇతర కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి:వేధింపులు భరించలేక వీఆర్​ఏ ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details