తెలంగాణ

telangana

ETV Bharat / crime

murder in Hyderabad: రూ.2 వేల కోసం స్నేహితుడిని గొంతు కోసి హత్య - ముషీరాబాద్​లో వ్యక్తి హత్య

ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు (Murder in Musheerabad). మద్యం మత్తులో డబ్బుల విషయంలో గొడవపడి సోను అనే యువకుడినీ అల్తాఫ్ ఖాన్ అనే యువకుడు కత్తితో గొంతుకోసి హత్య చేశాడు (a man murder his room mate).

murder
murder

By

Published : Nov 12, 2021, 5:20 AM IST

హైదరాాబాద్​ ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2వేల రూపాయల కోసం జరిగిన గొడవలో... ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు (Murder in Musheerabad). పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఉత్తరప్రదేశ్ వారణాసికి చెందిన సోను(27) బతుకుతెరువు కోసం ఆరేళ్ల క్రితం నగరానికి వచ్చి ముషీరాబాద్​లో స్థిరపడ్డాడు. ఆ ప్రాంతంలోనే మటన్​షాప్​లో పనిచేసే అల్తాఫ్ ఖాన్​తో సోనూ పరిచమయ్యాడు. ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. ఇద్దరూ కలిసి ముషీరాబాద్​లో ఓ గది అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు.

కొన్ని రోజుల క్రితం అల్తాఫ్ ఖాన్.. సోనూకు రూ.2వేలు అప్పుగా ఇచ్చాడు. తిరిగి ఇవ్వమని అల్తాఫ్ అడుగుతున్నప్పటికీ.. సోనూ దాటవేస్తూ వచ్చాడు. గురువారం రాత్రి సోనూ, అల్తాఫ్ ఇద్దరూ గదిలో మద్యం సేవించారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య డబ్బుల విషయమై గొడవ జరిగింది. మద్యం మత్తులో తీవ్ర ఆగ్రహానికి గురైన అల్తాఫ్... సోనూను కత్తితో గొంతుకోసి హత్య చేశాడు (a man murder his room mate). అనంతరం అల్తాఫ్ ఖాన్ ముషీరాబాద్ పోలీస్​ స్టేషన్​కు వెళ్లి లొంగి పోయినట్లు సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు.

ఇదీ చూడండి:NEET Student Suicide: డాక్టర్ కావాల్సిన యువతి.. ఫ్యాన్​కు ఉరేసుకుని...

ABOUT THE AUTHOR

...view details