తెలంగాణ

telangana

TRAGEDY: బిడ్డ పుట్టిన ఆనందం.. అంతలోనే విషాదం!

By

Published : Aug 25, 2021, 10:22 AM IST

వారం రోజుల క్రితమే ఆ ఇంట్లో పండంటి పాపాయి జన్మించింది. కానీ ఆ ఆనందం ఎంతోకాలం నిలవలేదు. అప్పటిదాకా బోసినవ్వుల పాపాయితో సందడిగా ఉన్న ఆ ఇంట్లో ఒక్కసారిగా విషాద ఛాయలు(TRAGEDY) అలుముకున్నాయి. పాప పుట్టిన తర్వాత తొలిరోజు విధులకు వెళ్లిన తండ్రి... ఇక ఇంటికి రాలేదు. 26 రోజుల తర్వాత విధలకు వెళ్లి... కంపెనీలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు(a man died in company).

TRAGEDY, man dead in company
కంపెనీలో వ్యక్తి మృతి, బిడ్డ పుట్టిన ఇంట విషాదం

నెలలు నిండిన భార్యకు అన్నీ.. తానై దగ్గరుండి చూసుకునేందుకు విధులకు సెలవు పెట్టాడు ఓ వ్యక్తి. వారం రోజుల క్రితమే అతడికి రెండో పాప పుట్టింది. పండంటి పసిపాపాయి పుట్టిన సంతోషం ఎంతోకాలం నిలవకముందే ఆ ఇంట్లో తీవ్ర విషాదం(TRAGEDY) అలుముకుంది. బిడ్డ పుట్టిన తర్వాత విధులకు వెళ్లిన తొలిరోజే అతడిని మృత్యువు కబళించింది(a man died in company). 26 రోజుల తర్వాత విధులకు హాజరవగా... యముడి రూపంలో ఉన్న యంత్రం బలిగొంది. ఈ హృదయ విదారక ఘటన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా దుండిగల్ పరిధిలో జరిగింది.

నిలవని సంతోషం

మెదక్ జిల్లా గొల్లగూడెంకు చెందిన దుర్గాప్రసాద్ (35), రుక్మిణి దంపతులు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. బతుకుదెరువు కోసం నగరానికి వలసవచ్చి డి.పోచంపల్లిలో నివాసముంటున్నారు. స్థానిక గండిమైసమ్మ చౌరస్తాలోని సాయిమోహిత ప్యాకింగ్ కంపెనీలో అతడు ఆపరేటర్‌గా పనిచేసేవాడు. నెలలు నిండిన భార్యకు అన్నీ తానై దగ్గరుండి చూసుకునేందుకు కంపెనీకి అతను సెలవు పెట్టాడు. వారం రోజుల క్రితమే ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలోనే కంపెనీకి సెలవు పెట్టిన 26 రోజుల తర్వాత మంగళవారం విధులకు హాజరయ్యాడు.

ప్రమాదం

కంపెనీలో విధులు నిర్వర్తిస్తుండగా ఊహించని రీతిలో మెషీన్‌కు ఉన్న బెల్టు తెగిపడటంతో... దానికి అనుసంధానమైన ఇనుప చక్రం పగిలి 8 ముక్కలైంది. అందులో ఒక ముక్క అతని తలకు బలంగా తాకింది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ఇనుప ముక్క కార్మికుడు శివ తలకు తగలడంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. మరో ఇద్దరు కార్మికులు జావేద్, సంతోష్‌లు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కుటుంబసభ్యుల ఆందోళన

పరిశ్రమలో కార్మికుడు మృతిచెందితే కనీసం సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించడం పట్ల కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ పరిశ్రమ వద్ద ఆందోళన చేపట్టారు.

ఈ కంపెనీలో దుర్గాప్రసాద్ ఏడేళ్ల నుంచి పని చేస్తున్నాడు. ప్రమాదవశాత్తు మంగళవారం మధ్యాహ్నం చనిపోతే... ప్రాణాలతో ఉన్నాడని ఆస్పత్రిలో చేర్చారు. ఆ తర్వాత కంపెనీ మూసేసి పరారయ్యారు. పోలీసుల సహకారంతో ఘటనా స్థలానికి వచ్చాం. బాధిత కుటుంబాన్ని ఆదుకోవడానికి కంపెనీ ముందుకు రావడం లేదు. ఈ మృతిపై యాజమాన్యం ఇప్పటివరకు స్పందించలేదు. -మృతుని బంధువులు

ఇదీ చదవండి:Suicide: అందీ అందని ఆశయం.. ఐఏఎస్‌ కాలేక విరక్తితో ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details