Husband killed wife at Teegalapahad : మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం తీగల పహాడ్లో దారుణం చోటుచేసుకుంది. అల్లూరి సీతారామరాజు నగర్లో భార్యను భర్త హతమార్చాడు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
ఏం జరిగింది?
Teegalapahad Murder case : తీగల పహాడ్లోని అల్లూరి సీతారామరాజు నగర్లో విజయ్ అనే వ్యక్తి తన భార్యను చంపేసి.. పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఆదివారం రాత్రి భార్యాభర్తలిద్దరూ గొడవపడి... కోపంతో భార్య అలేఖ్యను తీవ్రంగా కొట్టడం వల్ల ఆమె మృతి చెందిందని పోలీసులు తెలిపారు. లారీ డ్రైవర్గా పని చేసే విజయ్ కుటుంబం... నెల రోజుల క్రితం నుంచే అల్లూరి సీతారామరాజు నగర్లో అద్దె ఇంట్లో నివాసం ఉంటోందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన శ్రీరాంపూర్ సీఐ సంజీవ్... విచారణ చేపట్టారు.
తల్లి చంపిన కుమారుడు
మరో ఘటనలో తల్లిని కుమారుడు కొట్టి చంపాడు. హైదరాబాద్లోని సుల్తాన్బజార్లో దారుణం చోటు చేసుకుంది. ఓ కుమారుడు తల్లిని రాడ్డుతో తలపై కొట్టి చంపాడు. సుల్తాన్బజార్కు చెందిన సుధీర్కు కొంత కాలంగా మానసిక స్థితి సరిగా ఉండటం లేదు. ఈ క్రమంలోనే అతను అర్ధరాత్రి లేచి వ్యాయామం చేయడం ప్రారంభించాడు.