తెలంగాణ

telangana

By

Published : Jun 20, 2021, 2:49 PM IST

ETV Bharat / crime

AADHAR,PAN: ఆధార్, పాన్ వివరాలివ్వండి.. రూ. 500 తీసుకెళ్లండంటున్న ముఠా..?

ఆధార్, పాన్ వివరాలకు రూ.500 ఇస్తామంటున్న ప్రజల నుంచి వివరాలు, వేలిముద్రలు సేకరిస్తున్న ముఠా గుట్టు ఏపిలోని విశాఖ జిల్లా గాజువాకలో బయటపడింది. స్థానిక యువతకు అనుమానం రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. ప్రజలు ఇటువంటి ప్రచారాలను నమ్మవద్దని వారు హెచ్చరిస్తున్నారు.

a gang collecting aadhar pan details and thumb impressions from innocent women
ఆధార్ కార్డ్ పేరుతో మోసానికి పాల్పడిన ముగ్గురు యువకులు

నిరక్షరాస్యులు, పేద వారిని లక్ష్యంగా చేసుకుని ఓ ముఠా ఏపీలోని విశాఖ జిల్లా గాజువాకలో కొత్త తరహా మోసానికి తెరలేపింది. ఆర్థికంగా వెనుకబడిన ప్రజలు ఎక్కువగా నివసించే గాజువాక ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు పాన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్నవారికి రూ. 500 చెల్లిస్తామని ప్రచారం చేసింది. డబ్బు వస్తుందని ఆశపడ్డ స్థానిక మహిళలు వారి మాయమాటలు నమ్మారు.

ఈ ముఠా ప్రజల నుంచి అధార్ కార్డు, పాన్ కార్డు వివరాలు సేకరించి.. వారి వేలిముద్రలను సేకరించింది. ఈ విషయాన్ని గమనించిన కొందరు యువకులు అనుమానం వచ్చి వారిని ప్రశ్నించగడంతో ముఠాలోని ఇద్దరు సభ్యులు అక్కడి నుంచి పరారయ్యారు. నిందితుల్లో పట్టుకున్న యువకులు పోలీసులకు సమాచారం అందించారు.

నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు పలుకోణాల్లో ప్రశ్నిస్తున్నారు. అసలు వారు ప్రజల నుంచి ఆధార్, పాన్ వివరాలను ఎందుకు సేకరిస్తున్నారు..? వీటితో వారికి పనేంటి..? అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. పారిపోయిన మరో ఇద్దరు నిందితులను పట్టుకుంటే మరింత సమాచారం తెలిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఇవీ చదవండి:గల్ఫ్​లో ఉపాధి కోల్పోయి.. రెండేళ్లుగా యాచకుడిలా జీవనం

ABOUT THE AUTHOR

...view details