నీటి ఉద్ధృతికి కళ్లివంక వాగులో కారు కొట్టుకుపోయిన ఘటన ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఆలూరు మండలం హత్తిబెళగల్ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. ప్రత్యక్ష సాక్షుల వివరాల మేరకు.. ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కళ్లివంక వాగు పొంగింది. దీనిని గుర్తించని కర్ణాటకకు చెందిన ఓ ఫోర్డు వాహనం గుంతకల్లు నుంచి ఆలూరు వెళ్తూ అర్ధరాత్రి ప్రాంతంలో వాగులోకి దిగి కొట్టుకుపోయింది.
వాగులో కొట్టుకుపోయిన కారు.. పలువురు గల్లంతు! - Kurnool car washed away
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో నీటి ఉద్ధృతికి కళ్లివంక వాగులో కారు కొట్టుకుపోయింది. ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న ఆలూరు సీఐ ఈశ్వరయ్య, ఎస్సై రామానుజులు ఘటనా స్థలానికి చేరుకుని కొట్టుకుపోయిన వాహనం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
వాగులో కొట్టుకుపోయిన కారు.. పలువురు గల్లంతు!
సమాచారం అందుకున్న ఆలూరు సీఐ ఈశ్వరయ్య, ఎస్సై రామానుజులు ఘటనా స్థలానికి చేరుకుని కొట్టుకుపోయిన వాహనం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అందులో ఎంతమంది ఉన్నారనే సమాచారం తెలియడం లేదని ఎస్సై తెలిపారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి వైకుంఠం మల్లికార్జున, నాయకులు జహీర్, అమీర్ మరికొందరు వాహనదారులు, ప్రజలు ప్రత్యక్షంగా చూస్తుండగానే కారు నీటిలో కొట్టుకుపోయింది. పోలీసులు అక్కడే ఉండి వాహనం జాడ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఇవీ చదవండి: