తెలంగాణ

telangana

బావిలోకి దూసుకెళ్లిన కారు.. నలుగురి దుర్మరణం..

By

Published : Oct 28, 2022, 7:11 PM IST

Updated : Oct 28, 2022, 10:07 PM IST

car fell
car fell

19:03 October 28

బావిలోకి దూసుకెళ్లిన కారు.. నలుగురు దుర్మరణం..

బావిలోకి దూసుకెళ్లిన కారు.. నలుగురు దుర్మరణం..

మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో తీవ్ర విషాదం నెలకొంది. బైపాస్ రోడ్డు సమీపంలోని వ్యవసాయ బావిలో కారు బోల్తా పడి నలుగురు మృతి చెందారు. ఇందులో ఇద్దరు మహిళలు కాగా.. మరో ఇద్దరు పురుషులు ఉన్నారు. ఓ బాబుతో సహా ముగ్గురు ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద సమయంలో కారులో మొత్తం ఏడుగురు ఉన్నారు. వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లికి చెందిన ఓ కుటుంబం.. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ దర్గా వద్ద దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమయ్యారు.

మార్గమధ్యలో మహబూబాబాద్​కు చెందిన ఇద్దరు ఇదే కారులో ఎక్కారు. కేసముద్రం వద్ద మూలమలుపు రాగానే.. ఒక్కసారిగా వీరు ప్రయాణిస్తున్న కారు.. అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో మహబూబాబాద్​కు చెందిన తల్లీకుమారులు లలిత, సురేశ్​లతో పాటు టేకులపల్లికి చెందిన భార్యాభర్తలు అత్యాలి, భద్రులు దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని జేసీబీ సాయంతో కారును బయటకు తీశారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 28, 2022, 10:07 PM IST

ABOUT THE AUTHOR

...view details