హైదరాబాద్ బంజారాహిల్స్ పరిధిలోని రాక్ గార్డెన్ చెరువులో పడి 14 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. మాసబ్ట్యాంక్ ఫస్ట్ లాంచర్కు చెందిన మహ్మద్ సలీం అనే బాలుడు చేపలు పట్టేందుకు రాక్గార్డెన్లో ఉన్న చెరువులోకి దిగాడు.
చేపలు పట్టేందుకు వెళ్లి బాలుడు మృతి - హైదరాబాద్ బంజారాహిల్స్
బంజారాహిల్స్ పరిధిలోని రాక్ గార్డెన్ చెరువులో పడి ఓ 14 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. మాసబ్ట్యాంక్ ఫస్ట్ లాంచర్కు చెందిన మహ్మద్ సలీం అనే బాలుడు చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించాడు.

చేపలు పట్టేందుకు వెళ్లి బాలుడు మృతి
ఈ నేపథ్యంలో చేపలు పడుతూ ప్రమాదవశాత్తులో చెరువులో మునిగి చనిపోయాడు. గమనించిన స్థానికులు బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి:లక్షల విలువైన సిగరెట్లు అమ్మే వ్యక్తి అరెస్ట్