తెలంగాణ

telangana

ETV Bharat / crime

బహిర్భూమికి వెళ్లి.. కాల్వలో గల్లంతైన బాలుడు

సూర్యాపేట జిల్లా నాగారం మండలంలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు.. ఎస్సారెస్పీ కాల్వలో పడి ఓ బాలుడు గల్లంతయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. 3 గంటల నుంచి గాలింపు చేయిస్తున్నారు.

By

Published : Apr 9, 2021, 9:04 PM IST

boy drowns in the srsp
కాల్వలో గల్లంతైన బాలుడు

బహిర్భూమికి వెళ్లిన బాలుడు.. ప్రమాదవశాత్తు ఎస్సారెస్పీ కాల్వలో పడి గల్లంతయ్యాడు. ఈ ఘటన.. సూర్యాపేట జిల్లా నాగారం మండలంలో చోటుచేసుకుంది.

కొత్తపల్లి (ఢీ) గ్రామానికి చెందిన దిలీప్(14).. హైదరాబాద్​లో 9వ తరగతి చదువుతున్నాడు. బంధువుల శుభకార్యం నిమిత్తం.. రెండు రోజుల క్రితం తల్లిదండ్రులతో కలసి గ్రామానికి వచ్చాడు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల సమయంలో బహిర్భూమికని.. గ్రామ సమీపంలోని ఎస్సారెస్పీ కాల్వ వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు అందులో జారి పడ్డాడు. గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. 3 గంటల పాటు గాలించారు. బాలుడి ఆచూకీ లభ్యం కాకపోవడంతో.. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఇదీ చదవండి:బైక్ కింద పడి ఆరేళ్ల బాలుడు మృతి

ABOUT THE AUTHOR

...view details