Boy Died while eating groundnut: బంధువుల ఇంట్లో పండుగకు కుమారుడితో కలిసి వెళ్లిన ఆ దంపతులకు, కుటుంబీకులకు తీరని నష్టం వాటిల్లింది. పల్లీలు తింటుండగా అవి గొంతులో ఇరుక్కుని తమ రెండున్నరేళ్ల కుమారుడు మృతి చెందడంతో ఆ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలో చోటు చేసుకుంది.
Boy Died: పల్లీలు తింటుండగా గొంతులో ఇరుక్కుని బాలుడు మృతి - A boy died by stuck ground nut in throat
Boy Died while eating groundnut: అందరూ పండుగ పనుల్లో బిజీగా ఉన్నారు. అమ్మవారి గుళ్లో పండుగ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇల్లంతా బంధువులతో సందడిగా ఉంది. కాసేపటికే ఆ ఇంట్లో సంతోషం మాయమైంది. తన అల్లరితో ఇంటిల్లిపాదికీ సంతోషాన్ని పంచిన కుమారుడు.. కళ్ల ముందే చనిపోవడం వారిని తీవ్ర శోక సంద్రంలో ముంచేసింది. నల్గొండ జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది.
![Boy Died: పల్లీలు తింటుండగా గొంతులో ఇరుక్కుని బాలుడు మృతి Boy Died](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14206699-719-14206699-1642400882999.jpg)
చీకటిగూడెం గ్రామానికి చెందిన కుమ్మరికుంట్ల సైదులు, శైలజ దంపతులు ఆదివారం బంగారు మైసమ్మ దేవాలయం వద్ద పండగ చేసేందుకు బంధువులను ఆహ్వానించారు. ఈ క్రమంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం తుమ్మలగూడెంలో నివసిస్తున్న శైలజ సోదరి రేణుక, ఆమె భర్త మల్లేశ్, రెండున్నరేళ్ల వయసున్న వారి కుమారుడు అద్విత్ వచ్చారు. అందరూ పండగ ఏర్పాట్లలో నిమగ్నమవగా అద్విత్.. వంటింట్లో ఉన్న పల్లీలను తీసుకుని ఒక్కసారిగా నోట్లో వేసుకున్నాడు. అవి శ్వాసనాళంలో ఇరుక్కోవడంతో బాలుడికి ఊపిరాడలేదు. గమనించిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వెంటనే సూర్యాపేటలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు నిర్ధారించారు.
ఇదీ చదవండి:Farmer Death in Atmakur : పంటపై వానర మూకల దాడి.. ఆగిన అన్నదాత గుండె