తెలంగాణ

telangana

By

Published : Mar 27, 2021, 10:50 PM IST

ETV Bharat / crime

వాగులో దిగి 8 పాడిగేదెలు మృత్యువాత

దాహం తీర్చుకునేందుకు వాగులోకి దిగి 8 పాడిగేదెలు మృత్యువాతపడిన ఘటన మహబూబాబాద్​ జిల్లాలో చోటుచేసుకుంది. తమకు జీవనాధారమైన పశువులు తమ కళ్ల ముందే చనిపోవడం చూసి బాధితులు బోరున విలపించారు.

8 buffaloes died at kothapet
పాడిగేదెలు మృత్యువాత

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేటలో విషాదం చోటుచేసుకుంది. దాహం తీర్చుకునేందుకు వాగులోకి దిగి.. 8 పాడి గేదెలు మృత్యువాతపడ్డాయి.

గ్రామానికి చెందిన ముగ్గురు మహిళలు పాడి గేదెలను పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పశువులను రోజూ మేతకు ఊరి చివరన అడవిలోకి తీసుకెళ్తారు. ఈ క్రమంలోనే శనివారం మేతకు వెళ్లిన గేదెలు నీటి కోసం పక్కనే ఉన్న పెద్దకట్టువాగులోకి దిగాయి.

వాగులో నుంచి పంట పొలాలకు విద్యుత్​ మోటార్లు బిగించడంతో.. పశువులు విద్యుదాఘాతానికి గురయ్యాయి. 8 గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి. తమకు జీవనాధారమైన బర్రెలు తమ కళ్ల ముందే చనిపోవడం చూసి మహిళలు బోరున విలపించారు. పరిహారం చెల్లించి.. తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

ఇదీ చూడండి: గుర్తుతెలియని మహిళ దారుణహత్య.. కేసు నమోదు

ABOUT THE AUTHOR

...view details